కేంద్ర మాజీ మంత్రి సీకే జాఫర్ షరీఫ్ కన్నుమూత, ప్రముఖుల నివాళి
కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జాఫర్ షరీఫ్ ఆదివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. గత శుక్రవారం కారు ఎక్కుతూ ఆయన కుప్పకూలారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఫోర్టిస్ ఆసుపత్రిలోని ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. కానీ ఫలితం దక్కలేదు. రెండేళ్ల క్రితం ఛాతీలో అసౌకర్యంగా ఉందని ఆయన చెప్పారు. దీంతో ఆయనను పరీక్షించిన డాక్టర్లు ఫేస్ మేకర్ అమర్చుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా, జాఫర్ షరీఫ్ మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెంది నాయకులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ నేత దినేష్ గుండు రావు ట్వీట్ చేస్తూ... కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్లలో ఒకరని, పలుమార్లు ఎంపీగా గెలిచారని, రైల్వే శాఖ మంత్రిగా సక్సెస్ అయ్యారని పేర్కొన్నారు.