మాజీ కేంద్రమంత్రి హన్స్రాజ్ భరద్వాజ్ కన్నుమూత
న్యూఢిల్లీ: కర్ణాట మాజీ గవర్నర్, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి హన్స్జ్ భరద్వాజ్(83) ఆదివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న హన్స్జ్ భరద్వాజ్ బుధవారం ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో చేరారు.
Recommended Video
ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. హన్స్జ్ భరద్వాజ్కు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హన్స్జ్ భరద్వాజ్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం నిగంబోద్ ఘాట్లో నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు అర్జున్ భరద్వాజ్ తెలిపారు.
కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన హన్స్జ్ భరద్వాజ్.. ఆ తర్వాత కర్ణాటక, కేరళ గవర్నర్గా సేవలందించారు. 2009-2014 వరకు ఆయన కర్ణాటక గవర్నర్గా సేవలందించారు. జనవరి 2012-మార్చి 2013 వరకు కేరళ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా, హన్స్జ్ భరద్వాజ్ రాజకీయ ప్రస్థానం 1982లో ప్రారంభమైంది. ఇందిరా గాంధీ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. కాంగ్రెస్ నుంచి ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు హయాంలో 9ఏళ్లపాటు న్యాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. భరద్వాజ్ మృతి పట్ల కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు.