ఒడిశాలో విషాదం.. బొగ్గు గనిలో ప్రమాదంతో నలుగురు మృతి..
ఒడిశాలో విషాదం చోటు చేసుకుంది. కోల్ ఇండియా లిమిటెడ్కు చెందిన బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు చనిపోయారు. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. బొగ్గు ఒక్కసారిగా కుప్పకూలడంతో దాని కింద కార్మికులు దాని కింద చిక్కుకుపోయారు. బొగ్గు బరువుతో పాటు ఊపిరాడక నలుగురు వెంటనే ప్రాణాలు వదిలారు. మిగిలిన వారిని తోటి సిబ్బంది బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు.
మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంతో ఈ ఓపెన్ కాస్ట్ గనిని మూసివేశారు. ఈ గని నుంచి నిత్యం 20వేల టన్నుల బొగ్గును వెలికితీస్తారు. మైన్లో తిరిగి పని ప్రారంభించేందుకు వారం రోజుల సమయం పడుతుందని అధికారులు చెప్పారు. సరైన రక్షణ చర్యలు తీసుకోని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి.
భారత్లో బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు అత్యంత ప్రమాదకర వాతావరణంలో పనిచేస్తారు. 2018లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కోల్ ఇండియా, సింగరేణి కాలొరీస్ కంపెనీ లిమిటెడ్లో సగటున వారానికి ఒకరు చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో అక్రమ బొగ్గు మైనింగ్ జరుగోతంది. సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో వాటిల్లోనూ తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్ మేఘాలయాలోని ఓ అక్రమ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 15మంది కార్మికులుచిక్కుకున్నారు. మేఘాలయాలో ఇలాంటి ప్రమాదాల్లో ఇప్పటి వరకు వేల మంది కార్మికులు చనిపోయారు. వారిలో కొందరు పిల్లలు కూడా ఉన్నారు.