అమెరికన్ మహిళపై సామూహిక అత్యాచారం, ఎనిమిది మాసాల తర్వాత నిందితుల అరెస్టు
అమెరికన్ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ :భారతదేశంలో పర్యటించేందుకు వచ్చిన అమెరికన్ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై బాదితురాలు చేస్తోన్న ఆరోపణలపై పలు సందర్భాల్లో విచారణ జరిపిన తర్వాత ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అత్యాచారినికి గురైన బాదిత మహిళ అమెరికా నుండి తిరిగి వచ్చి మరో సారి పోలీసులకు పిర్యాదు చేసింది.దీంతో పోలీసులు మరోసారి కేసును విచారించి నిందితులను అరెస్టుచేశారు.
డిసెంబర్ 8వ, తేదిన నేపాల్ నుండి తిరిగి వచ్చిన టూరిస్ట్ గైడ్ ను విచారిస్తే తమపై వచ్చిన ఆరోపణలను నిందితులు ఖండించారు. అమెరికా నుండి వచ్చిన మహిళ టూరిస్టుకు గైడ్ గా వ్యవహరించిన వ్యక్తి కూడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.చివరకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే అమెరికా మహిళ పోలీసులకు ఈ ఏడాది అక్టోబర్ మాసంలో ఫిర్యాదుచేసింది. అయితే ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు నిందితులు అత్యాచారానికి గురికాలేదని తేల్చారు.
అత్యాచారం జరిగినట్టు చెబుతున్న మరునాడే ఆమెను ఆగ్రాకు తీసుకెళ్ళి చూపామని నిందితులు చెప్పారు. ఈ మేరకు వారు సాక్ష్యాలను కూడ చూపారు. కోర్టులో కూడ ఆమె సరైన వాంగ్మూలం ఇవ్వలేదు. అయితే అమెరికా వెళ్ళివచ్చి డిల్లీ పోలీసుల వద్ద ఆమె తన వాంగ్మూలం ఇవ్వడంతో కేసును తిరిగి పరిశోధించారు పోలీసులు.
తనకు గైడ్ గా వ్యవహరించిన వ్యక్తి తనతో స్నేహంగా ఉండేవాడని, ఏప్రిల్ 8వ, తేది తర్వాత రోజు కార్యక్రమం గురించి మాట్లాడే నెపంతో తన రూమ్ కు వచ్చి మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని , ఒకరి తర్వాత మరోకరు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ విషయం బయట చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అత్యాచారానికి సంబంధించిన వీడియో కూడ ఉందని చెప్పారు.ఈ విషయమై పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు.