వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మసాజ్‌సెంటర్‌లో ముగ్గురిపై రేప్: బాధితులేం చేశారంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలోని ఓ మసాజ్ సెంటర్‌లో రౌడీలు ప్రవేశించి ముగ్గురిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మసాజ్ సెంటర్‌లో ఉన్న సుమారు రూ. 15 వేలను కూడ నిందితులు దోపిడికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో భర్తతో విడిపోయిన వివాహిత మసాజ్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ మసాజ్ సెంటర్‌ను అనతికాలంలోనే మంచి ఆదరణ పొందింది.

నిర్వాహకురాలితో పాటు మరో ిద్దరు యువతులను కూడ నియమించుకొంది. దీంతో ఈ సెంటర్‌కు పెద్ద ఎత్తున కస్టమర్లు వచ్చేవారు. అయితే ఈ మసాజ్ సెంటర్ పై స్థానికంగా రౌడీ గ్యాంగ్ కన్నపడింది.

మసాజ్ సెంటర్ లో అత్యాచారం

మసాజ్ సెంటర్ లో అత్యాచారం

సేలం జిల్లాకేంద్రంలోని నామక్కల్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ళ మహిళ మసాజ్ సెంటర్ నిర్వహిస్తోంది. భర్తతో విడిపోయిన తర్వాత ఈ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ సెంటర్ అనతి కాలంలోనే మంచి ప్రాచుర్యం పొందింది. దీంతో ఈ సెంటర్ కు వచ్చే కష్టమర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక రౌడీ గ్యాంగ్ మసాజ్ సెంటర్‌లోకి వెళ్ళి తలుపులుగ బిగించి మసాజ్ సెంటర్ నిర్వహాకురాలితో పాటు మరో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. మసాజ్ సెంటర్లో ఉన్న రూ. 15 వేలను కూడ దోచుకొన్నారు.

బెదిరించారు

బెదిరించారు

మసాజ్ పార్లర్ నిర్వాహకురాలితో పాటు అక్కడ పనిచేసే ఇద్దరు యువతులపై కూడ రౌడీ గ్యాంగ్ అత్యాచారానికి పాల్పడింది. ఈ అత్యాచారం చేసిన విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే రౌడీల బెదిరింపులతో తీవ్రంగా ఇబ్బందులకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయాలా వద్దా అనే విషయమై తర్జన భర్జన పడింది.ఈ విషయమై భయాన్ని విడనాడిఎట్టకేలకు పోలీసులకు ఫఇర్యాదు చేసింది.

మసాజ్ సెంటర్లే లక్ష్యం

మసాజ్ సెంటర్లే లక్ష్యం

బాధితురాలు ఈ విషయమై ఎట్టకేలకు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. మసాజ్ సెంటర్లే లక్ష్యంగా స్థానికంగా ఉండే ఓ రౌడీ ముఠా ఈ దుర్మార్గానికి పాల్పడిందని పోలీసులు గుర్తించారు. గతంలో కూడ ఇదే తరహలో అత్యాచారాలతో పాటు దోపిడిలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా అరెస్ట్

సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా అరెస్ట్

సీసీ కెమెరాల ఆధారంగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టినట్టు పోలీసులు చెప్పారు. స్థానిక రౌడీ గ్యాంగ్ మసాజ్ సెంటర్‌లోకి వెళ్ళి తలుపులుగ బిగించి మసాజ్ సెంటర్ నిర్వహాకురాలితో పాటు మరో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. మసాజ్ సెంటర్లో ఉన్న రూ. 15 వేలను కూడ దోచుకొన్నారు.

English summary
Tamilnadu police were arrested four persons for rape and robbery at massage centre in tamilnadu state on may 8.police suspected that local rowdy sheeter connection with this incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X