వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేపాల్లో రెండు చోట్ల బాంబు పేలుడు.. నలుగురు మృతి
నేపాల్లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడగా మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. కాగా ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఖఠ్మాండులోని సుకేధర, ఘట్టెకు, నాగ్దుంగా ఏరియాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి.
కాఠ్మండులోని జనావాసల మధ్యలో ఈ పేలుళ్లు జరగడంతో అక్కడిక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతరం మరో పేలుడు సైతం నగర శివారులోని సుకేధరలో ఓ సెలున్ షాపులో పేలింది. దీంతో మొత్తం పేలుళ్లలో నలుగురు మృత్యువాత పడ్డారు. కాగా ఈ పేలుళ్లకు నగరంలోని పలు షాపుల గోడలు బీటలు వారాయి. కాగా బాంబు పేలిన ప్రాంతాన్ని నెపాల్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఈ పేలుళ్లకు సంబంధింది ఏ సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన వెలువరించలేదు.
Comments
English summary
As many as four persons have lost their lives on explosion of Improvised Explosive Devices at assorted locations in Kathmandu this afternoon.The incident took place at the house of Lokmanjari Karki, a Ghattekulo local
Story first published: Sunday, May 26, 2019, 23:31 [IST]