రాజ్యాంగ ధర్మాసనంలో వారు లేరు: వివాదం అలాగే...
న్యూఢిల్లీ: నలుగురు అసంతృప్త న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ ధర్మాసనంలో చోటు కల్పించలేదు. జస్టిస్ చలమేశ్వర్, ఎంబి లోకూర్, కురియన్, జోసెఫ్ల్లో ఎవరికి కూడా రాజ్యాంగ ధర్మాసనంలో చోటు కల్పించలేదు.
చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎకె సిక్రి, జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ, జస్టిస్ అశోక్ భూషణ్లతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఈ నెల 17వ తేదీ నుంచి కీలకమైన కేసులను ఈ బెంచీ విచారిస్తుంది.
అయితే, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ప్రెస్ మీట్ పెట్టి అసంతృప్తిని వ్యక్తం చేసిన న్యాయమూర్తులతో చర్చలకు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. తాను చేసింది సరైందనే ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.
ఆధార్ చట్టానికి రాజ్యాంగబద్ధత, వయోజనుల మధ్య రీ క్రిమనలైజింగ్ గే సెక్స్కు సంబంధించిన 2013 తీర్పు వంటి కీలకమైన కేసులను తాజాగా ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది.