ఇక నాలుగో శనివారం కూడా సెలవురోజే! ఉత్తర్వులు జారీ.. తక్షణమే అమలు!
బెంగళూరు: సాధారణంగా ప్రతి నెలా రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది. దీనికి అదనంగా మరో శనివారం కూడా జత చేరింది. ఇకపై ప్రతి నాలుగో శనివారం కూడా సెలవురోజుగా ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి బీ శివకుమార్ బుధవారం ఓ గెజిట్ను జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి.
ప్రతి నాలుగో శనివారం కూడా సెలవురోజుగా ప్రకటించాలని నిర్ణయిస్తూ ఈ నెల 6వ తేదీన విధానసౌధలో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం తీర్మానించింది. దీనికి అనుగుణంగా ఈ గెజిట్ వెలువడింది. ఇకపై కర్ణాటకలో ప్రతినెలా నాలుగో శనివారం కూడా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలన్నీ దీన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
నరసింహ యాదవ్ అవుట్.. చెవిరెడ్డి ఇన్!