ఉద్యోగులకు బంపరాఫర్, ఎయిరిండియాలో వాటా అమ్మకానికి గ్రీన్ సిగ్నల్
కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఎప్పటి నుండో ఊరిస్తున్న 7వ, వేతన సంఘం సిఫారసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.బుదవారం నాటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణ
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఎప్పటి నుండో ఊరిస్తున్న 7వ, వేతన సంఘం సిఫారసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.బుదవారం నాటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.
మంత్రివర్గ సమావేశ వివరాలను కేంద్రఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. జూలై నెల జీతం నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సవరించిన సిఫారసుల మేరకు అలవెన్స్ లు పొందుతారని స్పష్టం చేశారు.
బేసిక్ వేతనంపై x,y,z కేటగిరి నగరాల్లో గృహఅద్దె అలవెన్స్ రేటును 24 శాతం, 16శాతం, 8 శాతం చెల్లించనుంది. అలాగే డిఏ 50 శాతం దాటితే హెచ్ ఆర్ 27 శాతం, 18 శాతం, 16 శాతం, 8 శాతం చెల్లించనుంది. డిఏ వంద శాతం దాటితే 30 శాతం, 20 శాతం, 10 శాతం చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది.
అతి తక్కువ కేటగిరి ఉద్యోగులకు పర్సంటేజ్ స్థానంలో రూ.5400, రూ.3600. రూ.1800గా ఉంటుంది. ఆసుపత్రి అలవెన్స్ రూ.2070 నుండి రూ.4100 నుండి రూ.7200 కు పెరగనుంది. అలాగే పెన్షనర్లకు ఇప్పటివరకు ఇచ్చే మెడికల్ అలవెన్స్ రెట్టింపు చేసినట్టు జైట్లీ ప్రకటించారు.
రూ.500 బదులుగా రూ.వెయ్యి చెల్లిస్తామన్నారు. సైనికులకు ఇచ్చే రేషన్ ను ఇక మీద నగదురూపంలో చెల్లించనున్నట్టు చెప్పారు. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు.దీంతో రూ.30,748 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది. దీంతో బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నారు. దీంతో రూ.30,748 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది.
దీంతో సుమారు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,58లక్షల పించన్ దారులకు లబ్ది చేకూరనుంది. మరో వైపు ఎయిండియా వాటా అమ్మకానికి కూడ మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకారం క్యాబినెట్.