ఆల్టైం రికార్డ్: తొలిసారి లీటర్ పెట్రోల్ ధర రూ.86.56, డీజిల్ ధరలు కూడా పైపైకి!
Recommended Video
న్యూఢిల్లీ: ఇంధన ధరలు మరోసారి రికార్డు స్తాయిలో పెరిగిపోయాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో పాటు చమురు రవాణాపై విధిస్తున్న అధిక ఎక్సైజ్ సుంకం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. దీనికి తోడు రూపాయి పతనమవడం కూడా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ఫలితంగా దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్టైం గరిష్టానికి చేరాయి. సోమవారం నాటి రోజువారీ సవరణల ప్రకారం.. ముంబైలో రూ.86.56గా ఉంది. దేశంలో ఇప్పటివరకూ ఏ రాష్ట్రంలోనూ పెట్రోల్ ధర ఇంత అధిక ధర పలకలేదు.
ఇక
దేశరాజధాని
న్యూఢిల్లీలో
పెట్రోల్
ధర
తొలిసారిగా
79
మార్క్ను
దాటింది.
ఢిల్లీలో
లీటర్
పెట్రోల్
ధర
31పైసలు
పెరిగి
రూ.79.15గా
ఉంది.
ఇక
కోల్కతాలో
లీటర్
పెట్రోల్
ధర
రూ.
82.06,
చెన్నైలో
రూ.
82.24గా
ఉంది.
డీజిల్ ధర కూడా మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 39పైసలు పెరిగి రూ. 71.15గా ఉండగా, ముంబైలో రూ.75.54, చెన్నైలో 75.19, కోల్కతాలో రూ.74గా ఉంది. కాగా, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.