ఈ ఏడాది చివరి రోజున రికార్డు స్థాయిలో తగ్గిన పెట్రోలు ధరలు
ఈ ఏడాది నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన పెట్రోలు ధరలు చివరి రోజున అంటే డిసెంబర్ 31న అతి తక్కువ స్థాయికి పడిపోయాయి. 2018 మొత్తం ఇలా పడిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. మొత్తం నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోలు ధరలు తగ్గిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 68.84కు చేరుకుంది. ఆదివారం రోజున ఢిల్లీలో ఈ ధర రూ. 69.04 ఉన్నింది.
ఇక కోల్కతా, ముంబై, చెన్నైలలో లీటరు పెట్రోలు ధర వరుసగా రూ.70.96, రూ. 74.47, రూ.71.41గా ఉన్నాయి. అంతకుముందు అంటే ఆదివారం రోజున ఈ ధరలు ఈ ప్రధాన నగరాల్లో రూ. 71.15, రూ. 74.67 ,రూ. 71.62గా ఉన్నట్లు ఆయిల్ కార్పోరేషన్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడిచమురు ధరలు పడిపోవడంతోనే దేశంలో పెట్రోల్ ధరలు దిగివచ్చాయని నిపుణులు చెప్పారు. దేశంలోని ఇంధన ధరలు అంతర్జాతీయ ఇంధన ధరలు, రూపాయి విలువపై ఆధారపడి ఉంటాయి.

ఇదిలా ఉంటే భవిష్యత్తులో ఇంధన ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇందుకు కారణం చమురు ఉత్పత్తి దేశాలు, ఇతర దేశాలపై చమురు ఉత్పత్తిపై విధించిన ఆంక్షలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇది కచ్చితంగా ఇంధన ధరలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పెట్రోల్ ధరలతో పాటుగానే డీజిల్ ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై నగరాల్లో లీటరు పెట్లోలు ధర వరుసగా రూ. 62.86, రూ. 64.61, రూ.65.76, రూ.66.35 ఉన్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications