మోడీ హత్యకు గడ్కరీ కుట్రంటూ జేఎన్యూ విద్యార్థిని ట్వీట్: కేంద్రమంత్రి హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ/ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తోందంటూ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) విద్యార్థిని సెహ్లా రషీద్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది.
Looks like RSS/Gadkari is planning to assassinate Modi, and then blame it upon Muslims/Communists and then lynch Muslims #RajivGandhiStyle
— Shehla Rashid (@Shehla_Rashid) June 9, 2018
'పరిస్థితులు చూస్తుంటే మోడీని హత్య చేసేందుకు ఆరెస్సెస్/గడ్కరీ ప్రణాళిక వేశారనిపిస్తోంది. ఆపై ముస్లింలను, కమ్యూనిస్టులపై ఆ అభాండం నెట్టేసి వారిని కూడా ఊచకోత కోస్తారేమో!.. #RajivGandhiStyle' అంటూ షెహ్లా రషీద్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను పలువురు రీట్వీట్ చేశారు.
I would be taking legal action on anti-social elements who have made bizzare comments; attributing personal motives to me, regarding the assassination threat to PM @narendramodi
— Nitin Gadkari (@nitin_gadkari) June 9, 2018
కాగా, షెహ్లా రషీద్ను ప్రస్తావించకుండా సదరు పోస్టుపై నితిన్ గడ్కరీ ఘాటుగా స్పందించారు. 'ఇలా వికృతమైన వ్యాఖ్యలతో చెలరేగే ఆరాచక శక్తులను ఉపేక్షిస్తే మంచిది కాదు. వారిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నా' అంటూ ఆయన హెచ్చరించారు.