ఎఎంసి కేసులో గాలికి బెయిల్: అయినా జైల్లోనే
ఓఎంసి కేసులో బెయిల్ రానందున గాలి జనార్దన్ రెడ్డి జైల్లోనే ఉండాల్సి వస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి 2012 సెప్టెంబర్ నుంచి జైలులో ఉంటున్నారు. తొలుత ఓఎంసి కేసులో ఆయనను సిబిఐ అరెస్టు చేసి హైదరాబాదుకు తీసుకుని వచ్చింది. దీంతో గాలి జనార్దన్ రెడ్డిని త్వరలో హైదరాబాద్ తరలించే అవకాశాలున్నాయి. మరో మూడు నెలల వరకు బెయిల్ పిటిషన్ వేయరాదని సుప్రీంకోర్టు గాలి జనార్దన్ రెడ్డిని ఆదేశించింది. దీంతో ఓఎంసి కేసులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలున చేసే అవకాశాలు సమీప కాలంలో లేవు.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మి పేరు మీద ఉన్న అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఎఎంసి)పై సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గనుల అక్రమ తవ్వకాల కేసులో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం 21 మందిపై సిబిఐ ఎఫ్ఐఆర్ శనివారం దాఖలు చేసినట్లు తెలుస్తోంది. బెంగుళూర్లో డిజిగ్నేటెడ్ కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు సమాచారం.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి)కేసులో ఎఫ్ఐర్ దాఖలు చేసిన నెల రోజులు తర్వాత అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. గనుల అక్రమ తవ్వకాలపై 2012 సెప్టెంబర్ మొదటివారంలో సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, గాలి జనార్దన్ రెడ్డిని, బివి శ్రీనివాస రెడ్డిని అరెస్టు చేశారు.