గాలి కుమార్తె పెళ్లి మీద ఇంత కక్షా: అవసరమా ?
మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జానర్దన్ రెడ్డి ఎలాంటి తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటున్నారని ఆయన అభిమానులు, అనుచరులు అంటున్నారు. అందుకు కారణం అన్ని పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి గాలి జనార్ద
బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జానర్దన్ రెడ్డి ఎలాంటి తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటున్నారని ఆయన అభిమానులు, అనుచరులు అంటున్నారు. అందుకు కారణం అన్ని పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహానికి హాజరు కావడమే అని ఆయన అనుచరులు అంటున్నారు.
నిజంగా గాలి జనార్దన్ రెడ్డి తప్పు చేసి ఉంటే ఈ రోజు ఈ రాజకీయ పార్టీ నాయకులు వచ్చే వారా ? అని ఆయన అభిమానులు అంటున్నారు. ఓ వ్యక్తి పైకి ఎదిగితే తట్టు కోలేని చాలమందే ఉంటారు అనేది సర్వ సాదరంనం అని అన్నారు. అయితే గాలి తన కుమార్తె పెళ్లి చేస్తుంటే ఇబ్బందులు కల్పిస్తున్న వారి మీద గాలి అభిమానులు మండిపడుతున్నారు.
మాటకు వస్తే ఆరీఐ కార్యకర్తలు (సామాజిక కార్యకర్తలు) అంటూ కోర్టులో పిటీషన్లు వెయ్యడం మాములు అయ్యింది. ఓ రాష్ట్రానికి మంత్రిగా పని చేసిన ఆయన ఇలాంటి తెలివతక్కువ పని చేస్తారని ఆలోచింస్తారని మీరు ఆలోచించండం వేస్ట్ అని అన్నారు. నిజంగా చెప్పాలంటే గాలి జనార్దన్ రెడ్డికి చాల మంది సలహాదారులు ఉన్నారు.
ఆయనకు ప్రత్యేకంగా లాయర్లు ఉన్నారు. ఆయన బీజేపీలో మంత్రిగా కొనసాగినా అనేక పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు గాలికి సన్నిహితులుగా ఉన్నారు. అయితే అన్ని రాజకీయాలు పక్కన పెట్టి ఆయన తన కుమార్తె పెళ్లికి అందిరిని ఆహ్వానించారు. అందుకే గాలి అందరి దగ్గర గాలి జనార్దన్ రెడ్డి దగ్గర అయ్యారని ఆయన అభిమానులు అంటున్నారు.