రాహుల్ గాంధీ రాజీనామా.... ! చేయలేదు... స్పష్టం చేసిన కాంగ్రెస్
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరజాయం పోందిన కాంగ్రెస్ పార్టీ స్వంతగా 100 సీట్లు కూడ సాధించని పరిస్థితి.దీంతో ఒటమికి నైతకి భాద్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామ చేశాడంటూ వార్తలు ప్రచారం జరిగాయి. దీంతో వార్తలు అవాస్తవమని ఆపార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాల వివరణ ఇచ్చాడు. కాగా పార్టీకి ఓటమి భాద్యులు ఎవరని అడిగినప్పుడు అది పార్టీ అంతర్గత వ్యవహారమని రాహుల్ గాంధీ పేర్కోన్నాడు.
దీదీ కోటలో వికసించిన కమలం..! బెంగాల్ లో ప్రభంజనం సృష్టించిన మోదీ..!!
కాగా 2014లో కూడ యూపిఏ చైర్ పర్సన్,ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,ఉపాధ్యాక్షుడిగా రాహుల్ గాంధీ ఆధ్యర్యంలో ఎన్నికలు జరిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీ 2014లో జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 49 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. దీంతో కనీసం ప్రతిపక్ష హోదాకూడ దక్కని పరిస్థితి ఎదురైంది. దీంతో ఓటమీకి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షపదవికి సోనియా గాంధీ రాజీనామ చేసింది. అయితే ఆమే రాజీనామను పార్టీ వర్కింగ్ కమిటి సభ్యులు అంగీకరించలేదు.
ఇప్పుడు కూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అధ్యర్యంలో ఎన్నికలు జరిగాయి దీంతో ఆపార్టీకి 2014కంటే కొంత మెరుగైన స్థానాలు సాధించింది. అయినా నరేంద్రమోడీ అధ్యర్వయంలో బీజేపీ మూడువందలకు పైగా స్థానాలు సాధించి పూర్తి మెజారీటీ సాధించింది. దీంతో ఓటమీకి నైతిక భాద్యత వహిస్తూ రాజీనామ చేశారనే వార్తలు దావానంలా వ్యాపించాయి.