తీహార్ జైల్లో గ్యాంగ్ వార్: ఖైదీల హత్య
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో జరిగిన గ్యాంగ్ వార్ లో ఇద్దరు ఖైదీలు హత్యకు గురైనారు. 12 మంది ఖైదీలతో సహ జైలు సిబ్బందికి తీవ్రగాయాలు అయ్యాయి. ముందు జాగ్రత చర్యగా జైలు ఆవరణంలో కట్టుదిట్టమైన భద్రతా ఎర్పాట్లు చేశారు.
తీహార్ జైలు నెంబర్ 1లో కట్టుదిట్టమైన భద్రత ఉన్న వార్డులో ఉన్న ఖైదీలు ఈశ్వర్, షాదబ్, విజయ్ లను బుధవారం మద్యాహ్నాం రెండు గంటల సమయంలో జైలు ఆవరణంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య పరిక్షలు నిర్వహించారు.
తిరిగి ముగ్గురిని వార్డుకు తరలిస్తున్న సమయంలో ఖైదీలు అనిల్, వాసు, సందీప్ ల మద్య గ్యాంగ్ వార్ మొదలైయ్యింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. తేరుకున్న జైలు సిబ్బంది ఖైదీలను అదుపు చెయ్యడానికి ప్రయత్నించారు. అదే సందర్బంలో జైలు నెంబర్ 1,2,4 లలో ఉన్న ఖైదీలు రెచ్చిపోయారు.
పరస్పరం దాడులు చేసుకోవడంతో ఈశ్వర్ (20), అనీల్ (20) సంఘటనా స్థలంలో మరణించారని జైళ్ల శాఖ సీనియర్ అధికారి ముఖేష్ ప్రసాద్ తెలిపారు. తీవ్రగాయాలైన జైలు సిబ్బంది, ఖైదీలను దీనదయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించామని అన్నారు.
తీహార్ జైలులో జరిగిన గ్యాంగ్ వార్ పై సంబంధిత మంత్రిత్వ శాఖకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత చర్యగా తీహార్ జైలులో అదనపు బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఎర్పాట్లు చేశారు.