చెత్తకు ఆహారం పథకం: ఉచితంగా టిఫిన్, భోజనం..గార్బెజ్ కేఫ్ సక్సెస్!
రాయ్పూర్: ఇప్పటిదాకా పనికి ఆహారం పథకం గురించి విన్నాం. అధికారులు సూచించిన పని చేయడం దానికి తగ్గ లబ్ధిని పొందడం ఈ పథకం ఉద్దేశం. ఇదే కాన్సెప్ట్ను కాస్త అటు, ఇటుగా మార్చారు. చెత్తకు ఆహారం పథకంగా మార్చారు. చెత్తను తీసుకుని రావడం ఉచితంగా కడుపు నిండా భోజనం చేయడం ఇది దీని కాన్సెప్ట్. ఓ కిలో చెత్తను ఏరుకుని మున్సిపాలిటీ అధికారులకు అందజేస్తే.. ఓ పూట భోజనం ఉచితంగా పెడతారు. అరకిలో చెత్తను తీసుకెళ్లి వారి చేతిలో పెడితే- ఓ పూట టిఫిన్ చేసేయొచ్చు. ఉచితంగానే.
ఛిల్లింగ్
వీడియో:
బంగీ
జంప్
చేస్తున్నప్పుడు
బెల్ట్
తెగితే
ఏమౌతుందో
తెలుసా?
Recommended Video
చెత్తను నివారించడంలో భాగంగా- ఈ వెరైటీ పథకానికి తెర తీశారు ఛత్తీస్గఢ్ అధికారులు. ఆ రాష్ట్రంలోని అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దీన్ని తొలిసారిగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అది విజయవంతమైంది. దీనితో మరిన్ని కార్పొరేషన్లకు విస్తరించే పనిలో పడ్డారు అధికారులు.
ఈ పథకంలో భాగంగా- పేదలు, చెత్త ఏరుకునే వాళ్లు నివసించే ప్రాంతాలు, మురికివాడల్లో గార్బెజ్ కేఫ్ పేరుతో హోటల్ను ఆరంభించారు. ఇటీవలే ఈ హోటళ్లను అంబికాపూర్ మేయర్ డాక్టర్ అజయ్ టిర్కీ ప్రారంభించారు. ఈ హోటల్లో చెత్తను తీసుకుని ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నారు. కిలో చెత్తను సేకరించి మున్సిపల్ కార్యాలయంలో అందజేసిన వారికి కడుపు నిండా భోజనం..అర కిలో చెత్తకు టిఫిన్ ఇస్తారు. ఈ పథకం వల్ల పేదలకు కడుపునిండా భోజనం దొరుకుతోంది. దీని ప్రభావం వల్ల అంబికాపూర్లో చెత్త సేకరించేవారి సంఖ్య పెరుగుతోంది.
ఈ పథకం విజయవంతం కావడం వల్ల మరిన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు విస్తరింపజేయాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. చెత్తను ఏరుకునే వారి సంఖ్య పెరగడం వల్ల నగరంలో ఎక్కడే గాని అపరిశుభ్రత అనేదే లేకుండా పోయిందని వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.