కన్నడ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, ఊహాచిత్రాలు విడుదల, నేపాల్ లో తలదాచుకున్నారని !
కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు విచారణ చేస్తున్న ప్రత్యేక బృందం అధికారులు (సిట్) అనుమానిత హంతకుల ఊహా చిత్రాలను శుక్రవారం విడుదల చేశారు.
బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు విచారణ చేస్తున్న ప్రత్యేక బృందం అధికారులు (సిట్) అనుమానిత హంతకుల ఊహా చిత్రాలను శుక్రవారం విడుదల చేశారు. హంతకుల ఆచూకి ఇవ్వాలని సిట్ అధికారులు ఎన్ఐఏ అధికారులకు మనవి చేశారు.
మాలేగావ్ పేలుళ్ల నిందితుడు జయప్రకాష్, దాబోల్కర్, పన్సార్ ను హత్య చేసిన నిందితులు ప్రవీణ్ లిమ్కర్, సారంగ్ అకోల్కర్ కలిసి గౌరీ లంకేష్ ను హత్య చేసి ఉంటారని సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురు పక్కా మాస్టర్ ప్లాన్ వేసి గౌరీ లంకేష్ ను హత్య చేశారని సిట్ అధికారులు అంటున్నారు.
ముగ్గురు నిందితులు ప్రస్తుతం తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ ముగ్గురు నిందితులకు గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అనే సమాచారం ఇవ్వాలని సిట్ అధికారులు ఎన్ఐఏ అధికారులకు మనవి చేశారు. ముగ్గురు నిందితులు నేపాల్ లో రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారని ఎన్ఐఏ అధికారులు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ముగ్గురు నిందితులకు పలు హిందూ సంఘ, సంస్థలతో సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు అంటున్నారు.