ప్రభుత్వ లాంచనాలతో గౌరి లంకేష్ అంత్యక్రియలు, సీఎం, మంత్రులు హాజరు !
Recommended Video
బెంగళూరు: దుండగుల చేతిలో హత్యకు గురైన లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరి లంకేష్ పంచభూతాలలో కలిసిపోయారు. బుధవారం సాయంత్రం బెంగళూరు నగరంలోని చామరాజపేటలోని లింగాయత్ స్మశానవాటికలో గౌరి లంకేష్ అంత్యక్రియలు నిర్వహించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి, నగరాభివృద్ది శాఖ మంత్రి జార్జ్, ఆరోగ్య శాఖ మంత్రి రమేష్ కుమార్, మంత్రి, సినీనటి ఉమాశ్రీ, స్థానిక శాసన సభ్యుడు జమీర్ అహమ్మద్ తో పాటు అనేక మంది ప్రముఖులు, పాత్రికేయులు గౌరి లంకేష్ అంత్యక్రియలకు హాజరైనారు.
హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న గౌరి లంకేష్ అంత్యక్రియలు హిందూ సాంప్రధాయాలతో కాకుండా సర్వసాధరణంగా అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు ముందుగానే నిర్ణయించారు. ఎలాంటి ఆచారాలు పాటించకుండా పూలు మాత్రమే చల్లి ప్రభుత్వ లాంచనాలతో గౌరి లంకేష్ అంత్యక్రియలు పూర్తి చేశారు. గౌరి లంకేష్ అంత్యక్రియలు చేసే సమయంలో ఆమె సన్నిహితులు, అనుచరులు గౌరి లంకేష్ అమరహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.