కన్నడ ఎడిటర్ గౌరి లంకేష్ హత్య: సీసీకెమెరాల్లో, ప్రత్యక్ష సాక్షులు లేరు: డీజీపీ దత్త !
Recommended Video
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మతసామరస్య వేదిక నాయకురాలు గౌరి లంకేష్ (55) హత్య కేసులో బెంగళూరు పోలీసులు కీలక సాక్షాధారాలు సేకరించారు. గౌరి లంకేష్ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.
గౌరి లంకేష్ ఇంటిలో ఉన్న సీసీ కెమెరాల డీవీఆర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల పుటేజీలలో రికార్డు అయిన దృశ్యాలలో వెలుతురు తక్కువగా ఉండటంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
గౌరి లంకేష్ నివాసం ఉంటున్న రహదారిలోని అన్ని ఇండ్లుతో పాటు ఆ రహదారిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గౌరి లంకేష్ హత్యకు గురైన సమయంలో ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఎవ్వరూ లేరని, రివాల్వర్ తో కాల్చిన సమయంలో పెద్దగా శభ్ధం రావడంతో చుట్టు పక్కల వారు బయటకు వచ్చి చూశారని కర్ణాటక డీజీపీ రూప్ కుమార్ దత్త (ఆర్.కే. దత్త) బుధవారం మీడియాకు చెప్పారు.
గౌరి లంకేష్ ను హత్య చేసిన నిందితులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు అంటున్నారు. గౌరి లంకేష్ నివాసం ఉంటున్న ఇంటి చుట్టు పక్కల రహదారులలో ఏర్పాటు చేసిన అన్ని సీసీకెమెరాలను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు.