కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, 500 సీసీకెమెరాలలో హంతకుడు, సీఎంతో సిట్ భైటీ !
కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో ఎస్ఐటీ(సిట్) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో ఎస్ఐటీ(సిట్) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 500 సీసీ కెమెరాల పుటేజీలు స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు.
కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, నెల నుంచి హంతకుల నిఘా, హోం మంత్రితో భేటీకి !
బసవణగుడిలోని లంకేష్ పత్రిక కార్యాలయం నుంచి రాజరాజేశ్వరీ నగరలోని ఐడిల్ హోమ్స్ లోని గౌరీ లంకేష్ ఇంటి వరకు ఉన్న అన్ని రహదారాలు, పలు మాల్స్ ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న సిట్ అధికారులు హంతకులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి బీకే. సింగ్ దర్యాప్తు వేగవంతం చేశారు. శుక్రవారం బెంగళూరులోని అధికార నివాసం కృష్ణలో సీఎం సిద్దరామయ్య సిట్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు విషయంపై చర్చించారు.
ఎడిటర్ గౌరి లంకేష్: నివేదిక అడిగిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీబీఐ విచారణ !
కర్ణాటక డీజీపీ రూప్ కుమార్ దత్త (ఆర్ కే. దత్త), సిట్ అధికారి బీకే. సింగ్ తదితరులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో భేటీ అయ్యి గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు తీరును వివరించారు. గౌరీ లంకేష్ హత్యను ఖండిస్తూ శుక్రవారం బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పలు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.