తెలంగాణ పోలీసుల సహాయం కావాలి: కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, కర్ణాటక పోలీస్!
బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో తెలంగాణ ఇంటిలిజెన్స్ పోలీసుల సహాయం తీసుకుంటున్న కర్ణాటక సిట్ పోలీసు అధికారులు విచారణ వేగవంతం చేశారు. తెలంగాణ పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
గౌరీ లంకేష్ హత్య కేసులో నక్సల్స్ కు (మావోయిస్టులు) సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. నక్సల్స్ గౌరీ లంకేష్ ను హత్య చేశారని ప్రచారంలో ఉంది. గౌరీ లంకేష్ హత్యకు నక్సల్స్ కు సంబంధం ఉందని ఇప్పటి వరకూ ఇంటిలిజెన్స్ అధికారులకు ఎలాంటి సమాచారం లేదు.
గౌరీ లంకేష్ హత్య కేసుకు సహకరించాలని సిట్ అధికారులు తెలంగాణ ఇంటిలిజెన్స్ అధికారులకు మనవి చేశారు. గౌరీ లంకేష్ హత్యకు నక్సల్స్ కు సంబంధం ఉందని ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదని సిట్ అధికారులు అంటున్నారు.
గౌరీ లంకేష్ హత్యతో నక్సల్స్ కు సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. నక్సల్స్ ఎవరినైనా హత్య చెయ్యాలంటే సుపారి (కిరాయి) ఇవ్వరని, వారే స్వయంగా హత్య చేస్తారని, కిరాయి హంతకులను ఆశ్రయించరని తెలంగాణ పోలీసులు సమాచారం ఇచ్చారని కర్ణాటక సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు.