గౌతం గంభీర్కు బెదిరింపు కాల్స్, చంపేస్తామని ఇంటర్నేషనల్ నంబర్ నుంచి ఫోన్, పోలీసులకు ఫిర్యాదు
మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీఎంపీ గౌతమ్ గంభీర్కు బెదిరింపు కాల్స్ వస్తోన్నాయి. తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి థ్రెట్ కాల్స్ వస్తున్నాయని గంభీర్ తెలిపారు. ఈ మేరకు ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తనకు, కుటుంబానికి సరైన భద్రత కల్పించాలని కోరారు.
ఫోన్ కాల్ ఇంటర్నేషనల్ నంబర్ నుంచి వస్తోందని గంభీర్ తెలిపారు. ఫోన్ ఎత్తగానే దుండగులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. షాహ్దర డిప్యూటీ పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తనతోపాటు కుటుంబానికి కూడా సరైన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కోరారు.
ఇటీవల ఢిల్లీ కౌన్సిల్ సమావేశంలో గౌతం గంభీర్ పాల్గొనలేదు. తన సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్తో కలిసి జిలేబి తింటోన్న ఫోటో ఒకటి వైరలైంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో.. తాను జిలేబీ తినొద్దా అంటూ గంభీర్ రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు గౌతం గంభీర్.