వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనరల్ మోటార్స్ సంచలన నిర్ణయం: భారత్‌లో ఇక ఆ కార్ల అమ్మకం ఉండదు..

విక్రయాలు ఆపేసినా.. దేశీయంగా తయారీని మాత్రం కొనసాగిస్తామని సంస్థ ప్రకటించడం గమనార్హం. ఇక్కడ తయారీ ఉత్పత్తిని పెంచి, ఇతర దేశాల్లో వాటిని విక్రయాలను పెంచాలనే యోచనలో ఉంది.

|
Google Oneindia TeluguNews

అమెరికా: అమెరికన్ మల్టీనేషనల్ కార్పోరేషన్ జనరల్ మోటార్స్ కంపెనీ ఇకనుంచి తమ ఉత్పత్తులను ఇండియాలో నిలిపివేయనుంది. ఈ ఏడాది చివరి నుంచి భారత్ లో జనరల్ మోటార్స్ కార్లను విక్రయించరాదని నిర్ణయించింది. దేశంలో ఈ కంపెనీకి చెందిన ప్యాసెంజర్ కారు అమ్మకాలు 1శాతం కన్నా తక్కువ నమోదు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

కంపెనీ పునర్నిర్మాణ చర్యల్లో భాగంగానే భారతీయ మార్కెట్ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కంపెనీ తెలిపింది. విక్రయాలు ఆపేసినా.. దేశీయంగా తయారీని మాత్రం కొనసాగిస్తామని సంస్థ ప్రకటించడం గమనార్హం. ఇక్కడ తయారీ ఉత్పత్తిని పెంచి, ఇతర దేశాల్లో వాటిని విక్రయాలను పెంచాలనే యోచనలో ఉంది.

కాగా, భారత్ నుంచి ఎక్కువగా మెక్సికో, లాటిన్ అమెరికా దేశాలకు జనరల్ మోటార్స్ తన కార్లను ఎగుమతి చేస్తోంది. ఈ ఏడాది ఎగుమతులు రెట్టింపు చేయాలని జనరల్ మోటార్స్ నిర్దేశించుకుంది. కంపెనీ టలేగావ్ ప్లాంట్ ప్రస్తుతం 130,000 వాహనాలను తయారుచేసే సామర్థ్యం కలిగి ఉంది. విక్రయాల నిలిపివేతతో భారత విక్రయ సంస్థ చేవ్రొలెట్ సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను కంపెనీ మూసివేయనుందని జనరల్ మోటార్స్ తయారీ సంస్థ తెలిపింది.

భారత్ మార్కెట్ నుంచి నిష్క్రమించడం జీఎం ఇంటర్నేషనల్ ఆపరేషన్ ప్రదర్శనను మరింత బలోపేతం చేసేందుకు ఓ కీలకమైన మైలురాయిగా ఉపయోగపడుతుందని ఆ సంస్థ అధినేత స్టీఫన్ జాకోబి తెలిపారు.

English summary
General Motors Co will stop selling cars in India from the end of this year, drawing a line under two decades of battling in one of the world's most competitive markets where it has less than a one percent share of passenger car sales.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X