క్లీన్ గంగా మిషన్: ఒకే చెప్పిన జర్మనీ
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రసిద్ది చెందిన గంగానది ప్రక్షాళన కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు జర్మనీ అంగీకరించింది. గంగానది ప్రక్షాళలనకు జర్మనీ సాయం తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.
ఉత్తరాఖండ్ లో ప్రవహిస్తున్న గంగానదిలోని కొంత భాగాన్ని శుభ్రం చెయ్యాలని మోడీ సర్కారు నిర్ణయం తీసుకునింది. అందుకు యూరప్ లోని రైని నదిని క్లీన్ చెయ్యడానికి ఉపయోగించిన టెక్నాలజీని ఉపయోగించాలని నిర్ణయించారు.
ప్రవాసాంధ్రుల విజ్ఞప్తి మేరకు జర్మనీ గంగా నదిని శుభ్రం చెయ్యడానికి అంగీకరించిందని సుష్మాస్వరాజ్ తెలిపారు. క్లీన్ గంగా మిషన్ లో భాగస్వామి అయ్యేందుకు జర్మనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ తో సష్మాస్వరాజ్ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశాన్ని చేర్చారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించాయని తెలిపారు. భారత్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదోడ్లు నిర్మించాలన్న లక్షంతో చేపట్టిన స్వచ్చ విద్యాలయ లోనూ సాయం చెయ్యడానికి జర్మనీ అంగీకరించింది.