వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాదచారులపైకి దూసుకెళ్ళిన వ్యాన్, ముగ్గురి మృతి, ఉగ్రదాడా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెర్లిన్: జర్మనీలోని మ్యూన్‌స్టర్‌ నగరంలో శనివారం ఓ ఉన్మాది పాదచారులపై తన వ్యానును నడిపాడు. దీంతో సుమారు ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. మరోవైపు సుమారు 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

జర్మనీలో మ్యూన్‌స్టర్‌ నగరంలోని కీపెన్‌కెర్ల్‌ విగ్రహం సమీపంలో ఓ వ్యక్తి వ్యానుతో ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. పాదచారుల్ని వ్యానుతో గాయపర్చిన అనంతరం నిందితుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 Germany seeks motive after van crashes into crowd, killing 3

ఈ ఘటన ఉగ్రదాడా? కాదా? అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉగ్ర కోణంలో ఏమైనా ఈ దాడి జరిగిందా అనే విషయమై కూడు ఆరా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దాడిలో ఉగ్రకోణాన్నీ కొట్టిపారేయలేమనే అభిప్రాయాన్ని కొందరు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయమై ఇంకా పూర్తిస్థాయిలో ఆధారాలు లభ్యం కావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

English summary
A van crashed into people drinking outside a popular bar Saturday in the German city of Muenster, killing two people and injuring 20 others before the driver of the vehicle shot and killed himself inside it, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X