ఘోరం: పెళ్లికి నిరాకరించిందని... తండ్రీకొడుకులు కలిసి ఏం చేశారంటే...
పేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువతి వెంట పడిన యువకుడు ఆమె ఒప్పుకోకపోయేసరికి ఆగ్రహం పట్టలేక తండ్రితో కలిసి పాపం.. ఆ యువతిని సజీవ దహనం చేశాడు.
జైపూర్: పేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువతి వెంట పడిన యువకుడు ఆమె ఒప్పుకోకపోయేసరికి ఆగ్రహం పట్టలేక తండ్రితో కలిసి పాపం.. ఆ యువతిని సజీవ దహనం చేశాడు.
ఈ ఘటన జైపూర్ జిల్లా ఇసార్వాల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ యువతి(18) శనివారం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా రవి అనే యువకుడు అడ్డగించి తన ప్రేమను అంగీకరించాలని కోరాడు.
దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో చెంపపై కొట్టాడు. ఆ పక్కనే ఉన్న రవి తండ్రి కూడా అక్కడికి చేరుకొని ఆమెను చితకబాదాడు. అనంతరం తండ్రీ కొడుకులు ఇద్దరు కలిసి ఆమెపై కిరోషిన్ పోసి నిప్పంటించారు.
స్థానికులు పరుగుపరుగున వచ్చి బాధితురాలిని చికిత్స నిమిత్తం ఉదయపూర్ లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె ఆదివారం మరణించింది.
ఏడాది నుంచి రవి తమ కుమార్తెను ప్రేమించాలంటూ వెంటపడి వేధిస్తున్నాడని, ఆమె దానికి నిరాకరించడంతో ఆ ఘాతుకానికి ఒడిగట్టారని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని రవిని, అతని తండ్రిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.