పాస్ కానేమోనని బాలిక ఆత్మహత్య: ఫస్ట్ క్లాసులో పాస్
జంషెడ్పూర్: పరీక్ష పాస్ కానేమోనని ఆందోళన చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. అయితే బుధవారం వెలువడిన పరీక్ష ఫలితాల్లో ఆమె ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. దీంతో బాధితురాలి కుటుంబంలో విషాదం అలుముకుంది.
జార్ఖండ్ రాష్ట్రం కార్సావాన్ జిల్లాకు చెందిన శ్రియ శృతి ఆదిత్యపూర్లోని డిఏవి ఎన్ఐటి స్కూల్లో సిబిఎస్ఈ (10+2) చదువుతోంది. గణితం, సైన్స్ పరీక్షలు సరిగా రాయలేదని, ఉత్తీర్ణత సాధించలేనేమోననే భయంతో మంగళవారం అర్ధరాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆమె 66.8శాతం మార్కులతో ఉత్తీర్ణురాలైనట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.
నాగ్పూర్లో బస్సు ప్రమాదం: ఐదుగురి మృతి
ముంబై: మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీపంలో ఏసి బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.