పక్కింటి వ్యక్తితో పారిపోయింది, ఫ్యామిలీ చంపేసింది
లక్నో: పెళ్లైన ఓ వ్యక్తితో తమ కూతురు వెళ్లిపోయిందని ఓ కుటుంబం ఆమెకు ఉరేసి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో జరిగింది. ఇంటి పక్కన ఉండే పెళ్లైన ఓ వ్యక్తితో వెళ్లిపోయిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆమెకు ఉరి వేసి చంపేశారు.
మృతి చెందిన యువతి నాలుగు రోజుల క్రితం అంటే సోమవారం అతనితో కలిసి వెళ్లిపోయింది. అక్కడి నుండి వెళ్లిపోయి అతని స్వగ్రామంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది.
ఆమె ఆచూకీ తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమె వద్దకు వెళ్లి తిరిగి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే కుటుంబ సభ్యులు కోరికను ఆమె మన్నించలేదు.
ఈ క్రమంలో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు దుపట్టాతో ఆమె గొంతు ఊపిరాడకుండా చేశారు. ఆ తర్వాత ఆమె బాడీని వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసుల విచారణలో నిజం బయటకు వచ్చింది.