పుట్టిన రోజు నాడే అత్యాచారంకు గురైన యువతి..నిందితులు స్నేహితులే..!
ముంబై: పుట్టిన రోజును ఫ్రెండ్స్తో కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామనుకున్న ఆ 19ఏళ్ల యువతికి ఆ స్నేహితులే కాలయుములై కాటుశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ముంబైలోని చునాభట్టిలో చోటుచేసుకుంది. ఇక అసలు విషయానికొస్తే... ఔరంగాబాద్లో నివాసముంటున్న బాధితురాలు తన పుట్టిన రోజు వేడుకలను తన స్నేహితులతో జరపుకోవాలని ముంబైకి జూలై 7న వెళ్లింది.అయితే పుట్టిన రోజును జరుపుకునేందుకు ఆమె స్నేహితుల్లో ఒకరు తన ఇంటికి తీసుకెళ్లాడు. మరో ముగ్గురు మిత్రులు కూడా ఆ ఇంటికి వెళ్లారు. స్నేహితులే కదా అని గుడ్డిగా నమ్మిన యువతి వారి వెంటా వెళ్లింది.
ఇక కేక్ కట్ చేశాకా స్నేహితులు కాస్త కామాంధులుగా మారిపోయారు. అమ్మాయి ఒంటరిగా దొరికిందని ఆమెపై సామూహిక అత్యాచారంకు పాల్పడ్డారు. అయితే అమ్మాయి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఇక బయటకు చెప్పుకోలేక తనలో తాను మానసికంగా నలిగిపోయింది. జూలై 24వ తేదీన ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో నొప్పిగా ఉందంటూ ఫిర్యాదు చేసింది. నొప్పి భరించలేక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది హాస్పిటల్లో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు ఆమెపై లైంగిక దాడి జరిగిందన్న విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక చేసేదేమీ లేక జరిగిన విషయాన్ని పోలీసులకు తల్లిదండ్రులకు ఆ యువతి తెలిపింది. వెంటనే యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చునాభట్టిలో ఈ ఘటన జరిగినందున అక్కడి పోలీసులకు సమాచారం అందించారు ఔరంగబాద్ పోలీసులు. కేసు నమోదు చేసుకున్న చునాభట్టి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఇంకా నిందితులను అరెస్టు చేయలేదు పోలీసులు. పార్టీలంటూ యువతులు అబ్బాయిల వెంట వెళ్లడం మంచిందికాదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. స్నేహితులని నమ్మిన యువతిని వారేం చేశారో అందరూ ఒకసారి గ్రహించాలని కోరుతున్నారు.