చోర్!: ‘నా బర్త్ డే కేక్పై మోడీ ఫొటో ఉండాలి నాన్నా..’! ప్రధాని విషెస్, నెటిజన్ల శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: తన పుట్టిన రోజు సందర్భంగా ఓ చిన్నారిని ఆమె తండ్రి.. 'నీకేం కావాలి చిట్టి తల్లీ' అని అడిగారు. అయితే, ఆమె బొమ్మలు, చాక్లెట్లు ఇతర ఎలాంటి వస్తువులను కాకుండా తనకు ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో కావాలని అడిగిందట. దీంతో తండ్రి ఆమె కోరిన విధంగా మోడీ ఫొటో తీసుకొచ్చారు.
సొంత కారు లేదు, చేతిలో రూ.50వేలు కూడా లేవు!: మోడీ ఆస్తులెంతో తెలుసా?
మోడీ ఫొటోతో కేక్
ఆ తండ్రీ కూతుళ్లు ఎవరంటే మహేశ్ విక్రమ్ హెగ్డే, అతని కూతురు బెళకు. సెప్టెంబర్ 29న బెళకు పుట్టిన రోజు. దీంతో ఆమె పుట్టిన రోజు సందర్భంగా కట్ చేయబోయే మోడీ ఫొటోతో ఉన్న కేక్ను ఆమె తండ్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది.
మోడీ ఫొటో ఉండాలి..
‘ఈ రోజు నా కుమార్తె పుట్టిన రోజు. ఈ పుట్టిన రోజున నీకేం కావాలమ్మా? అని నా కూతుర్ని అడిగాను. దానికి తను.. ‘నా బర్త్ డే కేక్పైన మోడీ జీ ఫొటో ఉండాలి' అని అడిగింది' అని మహేశ్ ఆ పోస్టు పెట్టి వ్యాఖ్యానించారు.
మోడీ దొంగే..
అంతేగాక, ‘అవును.. నిజమే.. ప్రధాని మోడీ ఓ దొంగ.. ఆయన చిన్నారుల హృదయాలను కూడా దోచుకున్నారు' అని మహేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. మోడీ ఫొటోతో ఉన్న పుట్టిన రోజు కేక్ ఫొటోను కూడా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
మోడీ ఆశీర్వాదం.. నెటిజన్ల శుభాకాంక్షలు
కాగా, మహేశ్ ట్వీట్ చేసిన ఆ పోస్టు వైరరల్గా మారి, ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ప్రధాని ఆ ట్వీట్పై స్పందిస్తూ.. ‘చిన్నారి బెళకు నా ఆశీర్వాదాలు అందించండి. ఆమె నిండునూరేళ్లూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా' అని మోడీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను మహేశ్ రిట్వీట్ చేశారు. కాగా, బెళకు ఏకంగా ప్రధాని మోడీ ఆశీస్సులు లభించాయంటూ నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమదైన శైలిలో ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.