వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీచక టీచర్: విద్యార్థినులతో అర్ధరాత్రి నగ్న స్నానాలు, లైంగిక వేధింపులు

ఓ ప్రభుత్వ ఎయిడెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయుడు సభ్య సమాజం తలదించుకునే దారుణానికి ఒడిగట్టాడు.

|
Google Oneindia TeluguNews

ఔరంగాబాద్: ఓ ప్రభుత్వ ఎయిడెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయుడు సభ్య సమాజం తలదించుకునే దారుణానికి ఒడిగట్టాడు. విద్యార్థినులను అర్ధరాత్రి సమయంలో నగ్నంగా స్నానం చేయాలని ఆదేశించడమే కాకుండా వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఈ దారుణ ఘటన మహరాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటు చేసుకుంది. కాగా, ఈ కీచకుడు గత ఐదు నెలలుగా ఇదే తంతు కొనసాగిస్తున్నాడని ఓ బాధితురాలు బయటకు చెప్పడంతో అతడి పైశాచికం వెలుగు చూసింది.

Girls subjected to 'sexual abuse' at Beed school, teacher on the run

చిన్నారుల హక్కుల సంస్థ ఫిర్యాదు మేరకు షిర్పూప్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తం 120 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 36 మంది బాలికలు అని జిల్లా ఎస్పీ జి.శ్రీధర్ వెల్లడించారు. అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరుగా నివాస భవనాలు ఉన్నాయని పేర్కొన్నారు.

స్కూల్లో మొత్తం 8 మంది పురుష టీచర్లు ఉండగా, వారిలో ప్రతీ వారం ఇద్దరు చొప్పున స్కూల్లోనే బస చేస్తుంటారని తెలిపారు. స్కూల్లో వార్డెన్ లేరని, మహిళా టీచర్ ఒక్కరూ లేరని తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు.

English summary
While the horrific incident of rape of a girl from tribal school in Buldhana+ district is still afresh, yet another case of alleged sexual abuse has surfaced in a government-aided residential school in Maharashtra's Beed district, with a group of young girls mostly belonging to families of sugarcane harvesters claiming to be the victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X