వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారి పేర్లు ఇవ్వండి.. మంత్రుల తీరుపై మోడీ గుస్సా..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని కేంద్ర మంత్రులపై ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. సెషన్‌కు హాజరుకాని మంత్రుల పేర్లు సాయంత్రానికల్లా తనకు ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు.

మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ సెషన్‌కు డుమ్మా కొడుతున్న కేంద్ర మంత్రుల గురించి ఆరా తీశారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు కేబినెట్ మంత్రుల స్థానంలో సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు మంత్రులు తమ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతున్నప్పడు కూడా సభలో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

Give me names, Upset PM on absentee BJP ministers

సభలో బీజేపీ నేతల హాజరు, ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాల ఆధారంగా ర్యాంకులు ఇవ్వనున్నట్లు మోడీ జులై 2న జరిగిన సమావేశంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ సభ్యులంతా సభకు హాజరుకావాల్సిందేనని మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లో రాజకీయంగా యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.

English summary
Prime Minister Narendra Modi has asked for the details of all the Union ministers who did not attend Parliament despite being asked to be present for the session, pulling up BJP members for the second time this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X