వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవాలో బీజేపీకి ఎదురు దెబ్బ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, మనోహర్ పారిక్కర్ నియోజక వర్గం !

|
Google Oneindia TeluguNews

పణజి: గోవాలో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న పణజి శాసన సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాదించింది. పణజి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సిద్దార్థ్ కుంకోలియంకర్ ను స్థానిక ఓటర్లు ఆదరించకపోవడంతో ఓడిపోయారు.

పణజి నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మనోహర్ పారిక్కర్ సీఎం అయ్యారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మనోహర్ పారిక్కర్ మరణించారు. మనోహర్ పారిక్కర్ మరణంతో ఖాళీ అయిన పణజి నియోజక వర్గంలో మే 19న ఉప ఎన్నికలు జరిగాయి.

Goa: BJP loses former CM late Manohar Parrikars Panaji assembly seat in by election.

మనోహర్ పారిక్కర్ మరణించడంతో ఆయన కుమారుడు ఉత్పల్ పారిక్కర్ కు బీజేపీ టిక్కెట్ కేటాయిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే బీజేపీ నాయకులు సిద్దార్థ్ కుంకోలియంకర్ కు టిక్కెట్ కేటాయించారు. మనోహర్ పారిక్కర్ కుమారుడికి టిక్కెట్ కేటాయించకపోవడంతో సానుభూతి ఓట్లు దూరం అయ్యాయి.

పణజిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్దార్థ్ కుంకోలియంకర్ మీద పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అటానాసియో మోన్ఫ్ రట్స్ 1, 775 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాదించారు. గావాలో అధికారంలో ఉన్న బీజేపీకి పణజి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు.

English summary
Goa: BJP loses former CM late Manohar Parrikar's Panaji assembly seat in by election. Congress' Atanasio Monserratte won here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X