వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుర్తు పట్టలేనంతగా గోవా సీఎం, ఆసుపత్రిలో మీటింగ్, ఫోటోలు వైరల్, లీడర్ అంటే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యానికి గురై విదేశాల్లో చికిత్స పొంది తిరిగి భారత్ చేరుకున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గుర్తు పట్టలేనంతగా కనిపిస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అక్కడి నుంచి మంత్రులతో సంప్రధించి విధులు నిర్వహిస్తున్నారు.

తీవ్ర అనార్యోగంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కు మొదట ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఆ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు ఎయిమ్స్ ఆసుపత్రి చేరుకుని మనోహర్ పారికర్ ను పరామర్శించారు.

Goa CM Manohar Parrikars photos circulating in social media.

అనంతరం ఎయిమ్స్ వైద్యుల సూచనమేరకు విదేశాలకు వెళ్లిన మనోహర్ పారికర్ అక్కడ చికిత్స పొందారు. విదేశాల్లో చికిత్స పొందిన మనోహర్ పారికర్ ఇటీవల ఢిల్లీ చేరుకుని మళ్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్ శారీరకంగా చాల సన్నబడ్డారు. శరీరంలో ఎంతో మార్పు వచ్చినా ఆయన ప్రజల యోగక్షేమాలు, ప్రజా పరిపాలన గురించి ఆసుపత్రిలోనే మంత్రులు, అధికారులతో చర్చిస్తున్న సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Goa CM Manohar Parrikars photos circulating in social media.

అనారోగ్యంతో ఉన్నా ప్రజల గురించి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చూపిస్తున్న శ్రద్ద, ఆరాటం గురించి తెలుసుకున్న అనేక మంది ఆయన్ని సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు. ప్రజలకు సేవచేసే నాయకుడు అంటే మనోహర్ పారికర్ లాగా ఉండాలని అంటున్నారు.

English summary
Goa CM Manohar Parrikar's photos circulating in social media. After treatment Manohar looking very thin, but he did not loose strength in him he did cabinet meeting in the hospital itself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X