గోవా బీచ్ లో కాంగ్రెస్ గొడ్డుకారం: బీజేపీకి బిస్కెట్ !
గోవా బీచ్ అందచందాలు చూడటానికి, ఉల్లాసంగా ఎంజాయ్ చెయ్యడానికి దేశ, విదేశాల నుంచి ప్రతినిత్యం పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ పర్యాటకులే ఎక్కువగా వెలుతుంటారు.
పనాజి: గోవాలో స్థానిక ప్రజలు బీజేపీకి ఝలక్ ఇవ్వడానికి పలుకారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు పలు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గోవా సీఎం లక్ష్మికాంత్ పర్సేకర్ ఓటమిపాలై ఇంటికే పరిమితం అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ వైపు స్థానిక ఓటర్లు మొగ్గుచూపడానికి అక్కడి సీఎంపై ఉన్న వ్యతిరేకతతో పాటు బీజేపీ అధికారంలో ఉంటే లేనిపోని నిబంధనలు పెట్టి మా వ్యాపారాలు దెబ్బతీసే అవకాశం ఉందని అక్కడి వ్యాపారులు అనుమానం పెంచుకున్నారు.
గోవా బీచ్ అందచందాలు చూడటానికి, ఉల్లాసంగా ఎంజాయ్ చెయ్యడానికి దేశ, విదేశాల నుంచి ప్రతినిత్యం పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ పర్యాటకులే ఎక్కువగా వెలుతుంటారు. బీజేపీ అధికారంలో ఉంటే నియమ నిబంధనలు ఎక్కువగా పెట్టే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అయితే గోవా ఎన్నికల్లో మొత్తం అన్ని తానై నడిపిన కేంద్ర మంత్రి మనోహర్ పారీకర్ ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు మొత్తం వెలువడితే కాని ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం లేదు. బీజేపీ కార్యాలయంలోనో మనోహర్ పారీకర్ మకాం వేశారు.