గోవా చేదు అనుభవానికి ప్రతీకారం.. బీజేపీకి కాంగ్రెస్ షాకిస్తుందా?
కర్ణాటకలో బీజేపీ అత్యధిక స్థానాలున్న అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడపటి వార్తలు అందేసరికి కన్నడ అసెంబ్లీ హంగ్ దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో గోవాలో ఎదురైన చేదు అనుభవం మరోసారి పునరావృతం కాకుండా కాంగ్రెస్ నేతలు చర్యలు చేపట్టారు. గోవా అసెంబ్లీలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా కాంగ్రెస్ గెలిచినప్పటికీ.. బీజేపీ తన రాజకీయ చతురతను ప్రదర్శించి ముఖ్యమంత్రి స్థానాన్ని సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే.
Recommended Video
ప్రస్తుతం కర్ణాటకలో అత్యధిక స్థానాలు గెలుచుకొన్న పార్టీగా బీజేపీ అవతరించనున్నది. జేడీఎస్ మద్దతు ఉంటే గానీ ప్రభుత్వ ఏర్పాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గోవాలో బీజేపీ చేసిన అవమానానికి కాంగ్రెస్ గుణపాఠం నేర్పడానికి అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ ఏ మేరకు సఫలీకృతం చేసుకొంటుందోననే అంశంపై రాజకీయ విశ్లేషకులు దృష్టిపెట్టారు.
ఒకవేళ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా.. జేడీఎస్ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గోవా అవమానానికి ప్రతీకారం తీర్చుకొన్నట్టే అనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది.