మోడీ కాదు కదా: ఆదేవుడు కూడా ఇక్కడ బీజేపీని కాపాడలేరు !
మాడ్రెం నియోజక వర్గం నుంచి పోటీ చేసిన సీఎం లక్ష్మికాంత్ పర్సేకర్ దారుణంగా ఓటమిపాలయ్యారు. ఇప్పుడు బీజేపీ అధికస్థానాలు కైవసం చేసుకుంటే కేంద్ర మంత్రి మనోహర్ పారీకర్ మళ్లీ గోవా సీఎం అయ్యే అవకాశం ఉంది.
పనాజి: గోవాలో బీజేపీ పార్టీకి దిక్కెవరు అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. గోవా ముఖ్యమంత్రిగా ఉన్న లక్ష్మీకాంత్ పర్సేకర్ కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ సోప్టే చేతిలో ఓటమిపాలుకావడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.
మాడ్రెం నియోజక వర్గం నుంచి పోటీ చేసిన సీఎం లక్ష్మికాంత్ పర్సేకర్ దారుణంగా ఓటమిపాలయ్యారు. ఇప్పుడు బీజేపీ అధికస్థానాలు కైవసం చేసుకుంటే కేంద్ర మంత్రి మనోహర్ పారీకర్ మళ్లీ గోవా సీఎం అయ్యే అవకాశం ఉంది.
గోవా సీఎం లక్ష్మికాంత్ పర్సేకర్ మీద సొంత పార్టీలోనే తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. సీఎం లక్ష్మికాంత్ పర్సేకర్ మీద పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి దయనాంద్ సోప్టే విజయం సాధించి దర్జాగా మీసం మెలేస్తున్నారు.
పిబ్రవరి 4వ తేదీన జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 83 శాతం పోలింగ్ నమోదైంది. రికార్డు స్థాయిలో ఓటింగ్ లో పాల్గోన్న ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలిపే ఎన్నికల కౌంటిగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 11 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో ముందంజలో ఉంది