వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంత పద్మనాభూడి ఆలయంలో రూ.186 కోట్ల బంగారం మాయం!

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలోని అనంత పద్మనాభం ఆలయంలో రూ.186 కోట్ల విలువ చేసే బంగారం మాయమైనట్లుగా చెబుతున్నారు. అనంత పద్మనాభ స్వామి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవుడిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

పద్మనాభుడి ఖజానా నుంచి రూ. 186 కోట్ల విలువైన 769 బంగారు కుండలు అదృశ్యమైనట్టు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) మాజీ ఫైనాన్షియల్ కార్యదర్శి వినోద్ రాయ్ సుప్రీం కోర్టుకు తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఇవి మాయమయ్యాయన్నారు.

Gold worth Rs 186 crore missing from Padmanabhaswamy temple in Kerala

ఈ బంగారు కుండలకు సీరియల్ నంబర్ 1 నుంచి 1988 వరకూ ఇచ్చారని, అందులో ప్రస్తుతం 397 మాత్రమే ఉన్నాయని నివేదికలో వెల్లడించారు. ఆలయ కమిటీల లెక్కల ప్రకారం.. వీటిల్లో 822 బంగారు కుండలను ఆభరణాల కోసం కరిగించినట్టు ఉందని, వాటిని తొలగిస్తే 1,166 బంగారు కుండలు ఉండాల్సి ఉందన్నారు. ఆలయ కమిటీ బలహీనంగా ఉందని, దాన్ని తొలగించాలని సూచించారు. ఈ నివేదికపై చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టనుంది.

English summary
In a startling revelation, the Vinod Rai committee special audit report on Sree Padmanabha Swamy temple in Thiruvananthapuram, Kerala, stated that a lot of financial irregularities and corruption is going on in the temple administration and gold worth Rs 186 crore have gone missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X