17 రోజుల నుంచి కనిపించకుండా పోయిన రైలు
గాంధీనగర్: ఇప్పటివరకు విమానాలు కనిపించకుండా పోయిన వార్తలే విన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా రైలు కూడా కనిపించకుండా పోయిందనే వార్తలు వస్తున్నాయి. జోధ్పూర్ నుంచి గుజరాత్ బయలుదేరిన ఓ గూడ్స్ రైలు కనిపించకుండా పోయింది. అది కూడా 17 రోజుల నుంచి.
వివరాల్లోకి వెళితే.. ఓ గూడ్స్ రైలు జులై 27న రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి గుజరాత్లోని ముంద్రా రేవుకు వెళ్లేందుకు బయల్దేరింది. ఎగుమతుల వ్యాపారం చేసే రంజన్ కన్సారా అనే వ్యక్తి ఆ రైలును సరుకు రవాణా కోసం బుక్ చేసుకున్నారు. ఆ రైలులో మొత్తం 90 కంటైనర్లు ఉన్నాయి.
కాగా, ఒక్కో కంటైనర్లో రూ. 10 లక్షలు విలువ చేసే సామాగ్రి ఉంది. అంటే మొత్తం రూ. 9కోట్ల విలువ చేసే సామాగ్రితో ఆ రైలు బయల్దేరింది. మూడు రోజుల్లోగా గుజరాత్ చేరుకోవాల్సిన ఆ రైలు మధ్యలోనే కనిపించకుండా పోయింది.
ఇప్పటికి 17 రోజులైనా రైలు గమ్యస్థానాన్ని చేరుకోలేదు. ఆన్లైన్లో స్టేటస్ చూస్తే ఆగస్టు 2వ తేదీ నుంచి ఆ రైలు అహ్మదాబాద్లో ఉన్నట్లు చూపిస్తోంది. కానీ, రైలు అక్కడ కన్పించలేదు. దీనిపై రంజన్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. వర్షాల కారణంగా రైలు ఆలస్యమై ఉంటుందేమోనని అధికారులు తెలిపినట్లు సమాచారం.