కళ్లు చెదిరే నజరానా: సుందర్ పిచాయ్కు గూగుల్ ఎంతిచ్చిందంటే!
198.7మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డును కంపెనీ అందజేసింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ రూ.12,855 ఉంటుందని అంచనా.
హోస్టన్: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కంపెనీ నుంచి భారీ నజరానా అందుకున్నారు. 2016సంవత్సరానికి గాను ఆయనకు 198.7మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డును కంపెనీ అందజేసింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ రూ.12,855 ఉంటుందని అంచనా.
2015లో అందుకున్న నజరానాతో పోలిస్తే ఇది రెట్టింపు మొత్తం కావడం గమనార్హం. 2015లొ 652,500వేతాన్ని సుందర్ అందుకున్నారు. ఆ తర్వాతి ఏడాది స్వల్పంగా క్షీణించి 6,50,000కు అది చేరింది. యూట్యూబ్ వ్యాపారంతో పాటు, ప్రముఖ యాడ్స్ బిజినెస్ ద్వారా గూగుల్ ఆదాయాన్ని మరింత పెంచినందుకు గాను పిచాయ్ కు ఈ భారీ నజరానా అందజేశారు.
వీటితో పాటు మెషిన్ లెర్నింగ్, హార్డ్ వేర్, క్లౌడ్ కంప్యూటింగ్ పెట్టుబడుల ద్వారా కంపెనీ లాభాలను పెంచారని సీఎన్ఎస్ తెలిపింది. సంస్థకు ప్రయోజనం చేకూర్చే అనేక విజయవంతమైన ప్రాజెక్టులు రూపొందించినందుకు గాను సంస్థకు చెందిన నజరానాల కమిటీ సుందర్ కు ఈ భారీ ఆఫర్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే, 2004సంవత్సరంలో గూగుల్ లో ప్రొడక్ట్ మేనెజ్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ గా సుందర్ తన కెరీర్ ప్రారంభించారు. 2015లో సంస్థ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు.