కారణమిదే: చైనా వస్తువుల తక్కువ ధరకు
చైనా ప్రభుత్వం చిన్న, మధ్యతరహ పరిశ్రమలకు భారీ ఎత్తున సబ్సిడీని అందిస్తోంది.
న్యూఢిల్లీ: చైనా ప్రభుత్వం చిన్న, మధ్యతరహ పరిశ్రమలకు భారీ ఎత్తున సబ్సిడీని అందిస్తోంది. దీనివల్లే చైనాలో ఉత్పత్తైన వస్తువులు ఇతర దేశాల్లోని వస్తువుల ధరలతో పోలిస్తే చాలా తక్కువ ధరకేఅందుబాటులో ఉంటున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
గడిచిన 15 ఏళ్ళుగా చైనాలో తయారు చేసిన వస్తువులు ప్రపంచంలో విరివిగా లభిస్తున్నాయి. ఇతర దేశాల్లో తయారయ్యే వస్తువుల కంటే అతి తక్కువ ధరకే చైనా ఎలా వస్తువులను తయారు చేస్తోందని పలువురు ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే ఈ విషయమై కేంద్ర మంత్రి పార్థిబాయ్ పటేల్ లిఖిత పూర్వక సమాధానాన్ని ఇచ్చారు.
ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను సమయానుకూలంగా ప్రభుత్వం అందించే రుణాలు, టెక్నాలజీ స్థాయిని పెంచుకోవడం మార్కెటింగ్ సదుపాయాలు, నాణ్యత తదితర అంశాలు కూడ ఉత్పత్తి సంస్థలను ప్రభావితం చేస్తాయని ఆయన ఆ సమాధానంలో పేర్కొన్నారు.
అందుకే చైనా కంపెనీలు తమ వస్తువులను అతి తక్కువ ధరకే ఇతర దేశాల్లో విక్రయిస్తున్నాయని ఆయన చెప్పారు.