వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేంద్రం సంచలనం: బుజ్జగింపులకు స్వస్తి, హజ్ సబ్సిడీ రద్దు
న్యూఢిల్లీ: హజ్ యాత్రికులకు ఈ ఏడాది నుంచి సబ్సిడీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుజ్జగింపులకు తావు లేకుండా మైనారిటీలకు సాధికారిత కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
హజ్ సబ్సిడీని రద్దు చేస్తున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. మైనారిటీలను బుజ్జగించే ధోరణిలో కాకుండా గౌరవమర్యాదలతో సాధికారులను చేసే లక్ష్యంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
హజ్ సబ్సిడీ కోసం ఉద్దేశించిన నిధులను మైనారిటీల్లో విద్యా వికాసానికి, ఆ సమాజంలోని బాలికల సంక్షేమానికి ఖర్చు చేస్తామని అన్నారు ఈ ఏడాది రికార్డు సంఖ్యలో 1.75 లక్షల మంది హజ్ యాత్రకు వెళ్తున్నట్లు తెలిపారు.
హజ్ సబ్సిడీని క్రమంగా 2022 నాటికి పూర్తిగా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకేంద్ర ప్రభుత్వాన్ని 2012లో ఆదేశించింది.
Comments
English summary
Haj pilgrims will no longer receive any subsidy this year onwards, with the government saying the decision is part of its agenda of empowerment of minorities without appeasement.
Story first published: Tuesday, January 16, 2018, 17:25 [IST]