ఎయిర్ ఇండియాలో వందశాతం వాటాల అమ్మకం కోసం బిడ్లకు ఆహ్వానం
నష్టాలను చవిచూస్తున్న ఎయిర్ ఇండియా 100 శాతం వాటా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సోమవారం వందశాత వాటాల విక్రయం కోసం బిడ్లను ఆహ్వానించనుంది. 2018లో వాటా విక్రయించేందుకు బిడ్ దాఖలు చేసినా.. ఒక్క సంస్థ కూడా ముందుకురాలేదు. ఈ క్రమంలో సంస్థ వాటాల మొత్తాన్ని విక్రయించేందుకు బిడ్ వేస్తామని చెబుతోంది.
ఎయిర్ ఇండియాలోని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్లలో వాటాలు అప్పగిస్తామని పేర్కొన్నది. బిడ్లు దాఖలు చేసేందుకు ఆయా సంస్థలకు మార్చి 17 తేదీ గడువుగా నిర్ణయించింది. బిడ్డర్ 3.26 బిలియన్ల రుణం అందజేసి.. ఇతర బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుందని తెలిపింది.
ఎయిర్ ఇండియా వాటా కొనుగోలు భారతదేశ సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చింది. విదేశీ కంపెనీలు బిడ్లు దాఖలు చేసేందుకు తక్కువ ప్రయారిటీ ఇచ్చింది. 2018లో ఎయిర్ ఇండియా 76 శాతం వాటాను విక్రయించడానికి ప్రయత్నించింది. అయితే అందుకు 5.1 బిలియన్ డాలర్లు కోట్ చేయడంతో.. బిడ్లు దాఖలు చేసేందుకు ఏ సంస్థ ముందుకురాలేదు.
ఎయిర్ ఇండియా మహారాజా మస్కట్గా పేరుగాంచింది. దేశంలో, అంతర్జాతీయంగా ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లను కలిగి ఉంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు ల్యాండింగ్, పార్కింగ్ కీలకమైన అంశాలు.