ఎన్నికల బాండ్లు ఎందుకో చెప్పిన అరుణ్ జైట్లీ, సూచనలకు ఆహ్వానం
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లు అన్నవి ప్రస్తుతం ఉన్న విధానం కంటే మెరుగైనవిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రాజకీయ పార్టీలకు నిధులు ప్రస్తుతం విధానంలో నగదు రూపంలో వస్తున్నాయి.
దీని స్థానంలో బాండ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. తెలియని వ్యక్తుల నుంచి నల్లధనం పార్టీలకు పెద్ద ఎత్తున వస్తుండడం, వాటిని పార్టీలు బయటకు వెల్లడించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
కేంద్రం కీలక అడుగు, ఎన్నికల బాండ్లు: ఎలా పొందవచ్చో చెప్పిన జైట్లీ
ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు విరాళాల విధానాన్ని సంస్కరించేందుకు సూచనలను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని అరుణ్ జైట్లీ చెప్పారు.
పారదర్శకత లేకుండా పోయిందని, చాలా రాజకీయ పార్టీలు ప్రస్తుత విధానం పట్ల సంతృప్తితో ఉండడడమే కాకుండా ప్రత్యామ్నాయాలను నిరాకరిస్తున్నాయని, కనుక రాజకీయ పార్టీలకు నిధుల సాయాన్ని ప్రక్షాళన చేసే ప్రత్యామ్నాయ విధానం అవసమరని జైట్లీ చెప్పారు.