మహా హైటెన్సన్: మరో మూడురోజుల సమయం కోరిన శివసేన, నిరాకరించిన గవర్నర్
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు నెలకొంటున్నాయి. శివసేనతో ఎన్సీపీ దోస్తి కట్టగా.. చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ చేయి ఇచ్చే సిచుయేషన్ కల్పించింది. ఆ పార్టీ నాన్చివేత ధోరణితో ఆదిత్య థాకరే బృందం ప్రభుత్వ ఏర్పాటుపై భగత్సింగ్తో ఏమీ చెప్పలేకపోయారు.
మరో రెండు పార్టీ మద్దతు కోరతామని ఆదిత్య చెప్పారు. ముగ్గురు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు కూడా మద్దుత ఇస్తారని మూడురోజల సమయం ఇవ్వాలని కోరారు. కానీ అందుకు గవర్నర్ భగత్ సింగ్ నిరాకరించినట్టు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమకు మరింత సమయం ఇవ్వాలని ఆదిత్య కోరగా.. గవర్నర్ నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో హై టెన్షన్ నెలకొంది. తర్వాత వెంటనే గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎన్సీపీని కోరారు. మూడో అతి పెద్ద పార్టీ అయిన ఎన్సీపీ నేతలు అజిత్ పవార్ తదితరులు గవర్నర్తో సమావేశమయ్యారు. ఎన్సీపీకి కూడా గవర్నర్ 24 గంటల సమయం ఇచ్చారు. అప్పుడు కూడా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడకుంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది.
Governor says Shiv Sena asked for a 3 day extension but he refused #MaharashtraPolitics pic.twitter.com/Y2kjJFRCWQ
— Manak Gupta (@manakgupta) November 11, 2019