వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులతో ముగిసిన చర్చలు -కేంద్రం తిరకాసు -ఆ రెండింటికీ ఓకే -జనవరి 4న మళ్లీ భేటీ

|
Google Oneindia TeluguNews

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తోన్న రైతులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం జరిపిన ఆరో దశ చర్చలు ముగిశాయి. చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తొలి నుంచీ వాదిస్తోన్న కేంద్రం.. రైతు సంఘాల నేతలతో చర్చల్లోనూ అదే పట్టును కొనసాగించింది. రైతులు సైతం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. అయితే, ప్రధాన డిమాండ్ కు అదనంగా ఉంచిన ప్రతిపాదనలపై మాత్రం కీలక ముందడుగు పడింది..

తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూతిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూ

రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం జరిపిన చర్చలు మగిశాయని, జనవరి 4వ తేదీన మరోసారి సమావేశం కావాలని ఉమ్మడిగా నిర్ణయించామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. నేటి భేటీలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో దాదాపు 5 గంటల పాటు చర్చలు సాగించింది. వీటిలో రెండు డిమాండ్లకు కేంద్రం ఓకే చెప్పింది..

 Govt-farmers meeting concludes, center agrees for 2 demands,next talks on January 4

రైతుల డిమాండ్ మేరకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత కల్పించే అంశంపై కమిటీ వేసేందుకు కేంద్రం సుముఖం వ్యక్తం చేసింది. అలాగే విద్యుత్ బిల్లులను పెండింగ్‌లో పెట్టేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. మిగతా అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటామని రైతులు ముందుగా తమ ఆందోళనను విరమించాలని కేంద్రం కోరింది. కానీ..

 Govt-farmers meeting concludes, center agrees for 2 demands,next talks on January 4

కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని చెబితేనే నిరసనలు విరమించుకుంటామని రైతు సంఘాలు కేంద్రానికి స్పష్టం చేశాయి. దీంతో తదుపరి చర్చలు జరిగే జనవరి 4 వరకు రైతుల ఆందోళనలను కొనసాగడం ఖాయమైపోయింది. రైతు సంఘాల నేతలు ఇప్పటి వరకు కేంద్రంతో ఆరు దఫాలుగా చర్చలు జరిపారు. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో.. రెండు డిమాండ్లపై తప్ప, చట్టాలను వెనక్కి తీసుకునే విషయంలో స్పస్టమైన క్లారిటీ రాలేదు. దాంతో రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తూ వస్తున్నారు.

 Govt-farmers meeting concludes, center agrees for 2 demands,next talks on January 4

సర్కారు భోజనం మాకొద్దు, కమ్యూనిటీ కిచెన్‌లో వండుకొచ్చాం.. కేంద్రమంత్రులు కూడా రైతుల ఆహారాన్నే..సర్కారు భోజనం మాకొద్దు, కమ్యూనిటీ కిచెన్‌లో వండుకొచ్చాం.. కేంద్రమంత్రులు కూడా రైతుల ఆహారాన్నే..

English summary
the sixth round of meeting between farmer leaders and Central government has concluded with the next round of parleys slated for January 4. Sources said the government has agreed to address farmers concerns on Electricity Bill and exclusion of farmers from Air Quality Management Ordinance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X