పెట్రోల్పై రూ.10, డీజిల్పై రూ.13 ఎక్సైజ్ డ్యూటీ, బుధవారం అమలు,
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ధరలను పెంచింది. పెట్రోల్, డీజిల్పై రోడ్ సెస్ పేరుతో లీటర్కు రూ.8 విధించింది. దీనికితోడు అదనపు సుంకం పెట్రోల్పై రూ.2, డీజిల్పై రూ.5 పెంచుతున్నట్టు పేర్కొన్నది. దీంతో లీటర్ పెట్రోల్పై రూ. 10, లీటర్ డీజిల్పై రూ.13 రూపాయలు పెరగనుంది. బుధవారం నుంచి పెరిగిన ధర అమల్లోకి వస్తోంది.
ధరల పెంపు వాహనదారులపై ఉండదని అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండదని స్పష్టంచేశారు. కరోనా వైరస్ వల్ల ముడిచమురు ధరలు పడిపోవడం వల్ల చమురు సంస్థలపై ధరల భారం పడుబోతుందని తెలుస్తోంది. సెస్ పెంపు ఎక్సైజ్ సుంకం రూపంలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉన్నది. పెట్రో సంస్థల నుంచి ప్రభుత్వానికి ఆదాయం రానున్నది. వాస్తవానికి ప్రాథమిక సుంకాలు కేంద్రం రాష్ట్రాలతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.