ట్రిపుల్ తలాక్పై లోక్సభలో రచ్చ.. శబరిమల అంశాన్ని లేవనెత్తిన అసద్..
ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించే బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు 2019ను విపక్షాల అభ్యంతరాల మధ్య సభ ముందుంచారు. ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించాలన్న అంశాన్ని తాము వ్యతిరేకించడంలేదని, అయితే తలాక్ చెప్పిన భర్తకు జైలు శిక్ష విధించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు.
నేడు లోక్సభకు ట్రిపుల్ తలాక్ బిల్లు..
రవి శంకర్ ప్రసంగానికి అడ్డుతగలడం, కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు థరూర్కు బాసటగా నిలవడంతో సభలో గందరగోళం నెలకొంది. సభ్యుల నినాదాల మధ్య మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేవలం ముస్లిం మతానికి చెందిన వారు మాత్రమే భార్యలను విడిచిపెట్టడంలేదని, అన్ని మతాల మహిళలకు భద్రత కల్పించేలా చట్టం రూపొందించాలని థరూర్ అభిప్రాయపడ్డారు.
Recommended Video
శబరిమల
అంశాన్ని
ప్రస్తావించిన
అసదుద్దీన్
ఎంఐఎం
అధినేత
హైదరాబాద్
ఎంపీ
అసదుద్దీన్
ఒవైసీ
ట్రిపుల్
తలాక్
బిల్లుపై
తీవ్ర
అభ్యంతరం
వ్యక్తం
చేశారు.
ఈ
బిల్లు
రాజ్యాంగంలోని
14,
15
అధికరణలకు
వ్యతిరేకమని
అన్నారు.
కేవలం
ముస్లిం
పురుషులను
మాత్రమే
శిక్షించేలా
చట్టం
తీసుకురావడంపై
అసద్
అభ్యంతరం
వ్యక్తంచేశారు.
ముస్లిం
మహిళలకు
న్యాయం
చేస్తామంటున్న
సర్కారు
శబరిమల
అంశంలో
హిందూ
మహిళల
గురించి
ఎందుకు
మాట్లాడటంలేదని
ప్రశ్నించారు.
ఒవైసీ
శబరిమల
అంశాన్ని
ప్రస్తావించిన
వెంటనే
సభలో
మళ్లీ
గందరగోళం
నెలకొంది.
విపక్షాల
అభ్యంతరాల
మధ్య
స్పీకర్
ఓం
బిర్లా
బిల్లును
చర్చకు
స్వీకరించడంపై
ఓటింగ్
నిర్వహించారు.
అవసరమైన
మద్దతు
లభించడంతో
ట్రిపుల్
తలాక్
బిల్లును
చర్చకు
స్వీకరించినట్లు
ప్రకటించారు.