మైనర్ బాలికపై ఏడాది కాలంగా తాత అత్యాచారం, చివరికిలా...
ఏడాది కాలంగా మనమరాలిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఓ తాత. అంతేకాదు ఆమె ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించాడు. పోలీసుల విచారణలో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
కొల్లం: మనమరాలిని అల్లారుముద్దుగా పెంచాల్సిన తాతే ఆమె పాలిట కీచకుడిగా మారాడు. ఆమెపై అత్యాచారానికి ఏడాదిగా పాల్పడ్డాడు.ఈ వేధింపులు భరించలేక బాధితురాలు ఆత్మహత్య చేసుకొంది,. అయితే ఆమె ఆత్మహత్య చేసుకొనేలా నిందితుడు ప్రేరేపించాడని పోలీసుల విచారణలో తేలింది.
కేరళలోని కొల్లం కుందారా ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక ఇటీవల ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాక్ కు గురయ్యే వాస్తవాలు తెలుసుకొన్నారు.
మైనర్ బాలికైన మనమరాలిపై ఏడాదిగా తాత అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అంతేకాదు ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు ఆమె అత్యాచారం చేసుకొనేలా ప్రేరేపించాడని పోలీసుల విచారణలో తేలింది.
ఈ ఘటన కేరళ రాష్ట్రంలో సంచలనం కల్గించింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు, బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులను నిందితుడిపై నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.